కోటా: మధ్యాహ్న వేళ ఎండ దంచికొడుతున్నది. వేడి తాళలేక అంతా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో వీధి మొత్తం నిర్మాణుష్యంగా మారింది. ఇదే అదనుగా భావించాడో దుండగుడు. ఆ వీధిలోని ఓ ఇంట్లోకి వెళ్లాడు. తలుపునకు తాళం (Lock) ఉండటంతో దానిని పగులగొట్టాలని ప్రయత్నించాడు. ఎంతకూ అది రాకపోవడంతో.. చేసేదేంలేక ఇంటి మెట్ల కింద ఉన్న ఇన్వర్టర్ (Inverter) ఎత్తుకెళ్లాడు. పట్టపగలే దొంగతనం జరిగిన ఈ ఘటన రాజస్థాన్లోని (Rajasthan) కోటాలో (Kota) జరిగింది.
కోటాలోని బోరాఖేడాకు చెందిన సంజయ్ సుమన్ (Sanjay Suman) అనే వ్యక్తి రోజువారీ విధుల్లో భాగంగా ఆఫీస్కు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటికి తాళం వేశాడు. అయితే మధ్యాహ్న సమయంలో వారి వీధిలో జనసంచారం లేకపోవడంతో.. ఓ దుండగుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. డోరుకున్న తాళం బద్దలుకొట్టాలని చూసినప్పటికీ అది సాధ్యం కాలేదు. దీంతో చేసేదేంలేక మెట్ల కింద ఉన్న ఇన్వర్టర్ తీసుకొని దర్జాగా బైక్పై వెళ్లిపోయాడు. ఇదంతా పొరుగిండ్లలో ఉన్న కెమెరాల్లో రికార్డయింది. ఇంటికి తిరిగొచ్చిన సుమన్.. విషయాన్ని గమనించి.. ఇరుపొరుగు సీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజీని తీసుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.