ముంబై, అక్టోబర్ 19: భారత్లో మహిళలు, బలహీన వర్గాలు, మైనారిటీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనరల్ గుటెరస్ సూచించారు. బుధవారం ఆయన ముంబైలో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా భారత్కు.. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మైనారిటీలతోపాటు ప్రజలందరి వ్యక్తిగత హక్కులను రక్షించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి స్వాతం త్య్రం పొందినప్పటినుంచి భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని కొనియాడారు.