న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చాంద్బాగ్లో 2020లో జరిగిన అల్లర్ల కేసులో అరెస్టైన జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్ ఖలీద్ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. పోలీసులపైకి రాళ్లు రువ్విన సంఘటనకు సంబంధించిన కేసులో మరో విద్యార్థి నేత ఖలీద్ సైఫీ కూడా నిర్దోషిగా కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు ఈ మేరకు శనివారం తీర్పు ఇచ్చింది. వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.
కాగా, 2020లో ఢిల్లీలోని చాంద్బాగ్లో జరిగిన అల్లర్ల సంఘటనలో 53 మంది మరణించగా 700 మందికిపైగా గాయపడ్డారు. అల్లర్ల కుట్రకు సంబంధించిన నేరం కేసులో అరెస్టైన జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్ ఖలీద్, మరో విద్యార్థి నేత ఖలీద్ సైఫీపై రాళ్లు రువ్విన ఘటనతోపాటు ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద మరో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు అక్టోబర్లో నిరాకరించింది. దీంతో ప్రస్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం జైలులో ఉన్నారు.