న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయంలో మరోసారి అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ విద్యార్థులంతా కీవ్ నగరాన్ని వీడాలని సూచించింది. ఉక్రెయిన్ను వీడేందుకు రైళ్లు, బస్సులు, ఇతర మార్గాలను వినియోగించుకోవాలని సూచించింది. రష్యా సైన్యం 24 గంటల్లో కైవ్ నగరంపై వేగంగా దాడి చేసే అవకాశం ఉందని, భారతీయ పౌరులు, విద్యార్థులంతా ముందస్తుగానే నగరం విడిచి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు సమాచారం అందినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. రష్యన్ దళాలు కీవ్కు ఉత్తరాన, ఖార్కివ్, చెర్నిహివ్ నలువైపులా దాడులను పెంచాయి. జనం సాంద్రత ఉన్న పట్టణ ప్రాంతాల్లో భారీ ఫిరంగులతో దాడులకు దిగుతుండడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ సమాచారాన్ని వెల్లడించింది.