న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Jhonson) నేడు భారత్కు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్ ఇప్పటికే పలుమార్లు తన టూర్ రద్దు చేసుకున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో భారత్కు రానున్నారు. గురువారం లండన్ నుంచి నేరుగా గుజరాత్లోని అహ్మదాబాద్కు చేరుకుంటారు. అక్కడ పారిశ్రామిక, వ్యాపారవేత్తలో సమావేశమవుతారు. ఈ సందర్భంగా భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది. అనంతరం ఢిల్లీ పయణమవుతారు.
శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రక్షణ, వాణిజ్య బంధాలు, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత సహా పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవశకాశం ఉన్నది. ఇరు దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడం, వ్యూహాత్మక రక్షణ రంగ చర్యలు, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం.. లాంటి విషయాలపై చర్చించనున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా బోరిస్ జాన్సన్ గతేడాది రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. గత జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్లో పర్యటన ఖరారు కాగా.. భారత్లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.