న్యూఢిల్లీ: స్మార్ట్వాచ్.. యూజర్ల ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి యూకేలో ఓ కంపెనీ సీఈవో ప్రాణాలు నిలబెట్టింది. హాకీవేల్స్ కంపెనీ సీఈవో పాల్ వాఫమ్ (42) స్వాన్సీ ప్రాంతంలోని మోరిస్టోన్లో తన ఇంటి సమీపంలో ఉదయం రన్నింగ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో విలవిల్లాడిపోయాడు.
బాధను భరిస్తూనే తన స్మార్ట్వాచ్ నుంచి భార్యకు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె వెంటనే దవాఖానకి తరలించింది.