పీహెచ్డీ అడ్మిషన్ల కోసం యూజీసీ నిబంధనలను సవరించింది, నెట్/జేఆర్ఎఫ్ కాకుండా వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా 40% సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రోగ్రామ్లను “రీ ఓరియంట్” చేయాలనే ఆలోచన ఉందని అధికారులు తెలిపారు.
యూజీసీ చైర్మన్, సభ్యులతో మార్చి 10న నిర్వహించిన 56వ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఇకనుంచి నెట్ లేదా స్లెట్లో అర్హత సాధించినవారితో 60శాతం సీట్లను భర్తీచేస్తారు. వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా 40% సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నిర్ణయాన్ని యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్కుమార్ గురువారం ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన నియమ, నిబంధనలు త్వరలోనే యూజీసీ వెబ్సైట్లో ఉంచుతారు.