ముంబై, జూన్ 3: మహారాష్ట్రలో అయిదంచెల అన్లాక్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని సహాయ, పునరావాస మంత్రి ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. కరోనాను ఇంకా నియంత్రించాల్సి ఉన్నందున ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను ఎక్కడా సడలించబోమని స్పష్టం చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ఆంక్షలను తొలిగించాలనే అంశం కేవలం పరిశీలనలో ఉన్నదని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు అయిదంచెల్లో లాక్డౌన్ను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు సహాయ, పునరావాస మంత్రి విజయ్ వడెట్టివార్ తెలిపారు. మరోవైపు… కర్ణాటకలో లాక్డౌన్ను ఈ నెల 14 వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.