లక్నో: దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలురపట్ల కొందరు పైశాచికంగా ప్రవర్తించారు. వారితో బలవంతంగా మూత్రం తాగించారు (Boys Forced To Drink Urine). అలాగే వారి ప్రైవేట్ భాగాలపై మిరపకాయలు రుద్దారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. డబ్బులు దొంగిలించారన్న ఆరోపణలతో 10, 15 ఏండ్ల వయస్సున ఇద్దరు పిల్లలను కొందరు కట్టేసి కొట్టారు. వారితో పచ్చి మిర్చి తినిపించారు. బాటిల్లో ఉన్న మూత్రాన్ని బలవంతంగా తాగించారు. అలాగే వారిని బోర్లా పడుకోమని చెప్పి దుస్తులు తొలగించారు. బాలుర ప్రైవేట్ భాగాలపై మిరపకాయలు రుద్దించారు. పచ్చని రంగులో ఉన్న ద్రవాన్ని ఇంజెక్షన్ చేశారు. ఈ టార్చర్ భరించలేక ఆ ఇద్దరు పిల్లలు బాధతో విలవిలలాడిపోయారు.
కాగా, ఆగస్ట్ 4న పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్షన్ చికెన్ షాప్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్న పోలీస్ ఈ వీడియోను చూశాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | After a viral video purportedly showing two minors in UP's Siddharthnagar surfaces, ASP Siddhartha says, "A viral video on social media has come to notice in Thana Pathra Bazaar regarding objectionable acts with two minors. After taking note of the viral video, cases… pic.twitter.com/8yUGfkojal
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2023