శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్లోని ట్రుబ్జీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. కుల్గామ్లోని నౌపోరా-ఖేర్పోరా త్రుబ్జీ ప్రాంతంలో సోమవారం ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ట్వీట్ చేశారు. అయితే, దోడా పోలీసులు భద్రతా దళాలతో కలిసి ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి.
అతని వద్ద చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్లు, ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఏడాదిలో కశ్మీర్ లోయలో 118 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఈ నెల 23న పోలీసులు తెలిపారు. వీరిలో 32 మంది విదేశీ ఉగ్రవాదులు సైతం హతమయ్యారని పేర్కొన్నారు. గత ఏడాది 2021లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 55 మందిని మట్టుబెట్టినట్లు వివరించారు.