శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిన్న సాయంత్రం కుప్వారాలోని కర్నా ఏరియాలో సఫీర్ అహ్మద్ షేక్, జమీర్ హుస్సేన్ షేక్ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరి వద్ద ఎనిమిది హ్యాండ్ గ్రనేడ్లు, ఒక పిస్తోల్, ఏడు రౌండ్లు బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.