బీజింగ్: చైనాలో రెండు చోట్ల బొగ్గు గనులు(Coal Mines) కూలాయి. ఈ ఘటనల్లో 12 మంది మరణించారు. మైనింగ్ సేఫ్టీ గురించి ఇటీవలే చైనా సర్కారు కొత్త చట్టాలను తయారు చేసింది. అయినా కానీ గనుల కూలిన ఘటన చోటుచేసుకోవడం విషాదకరం. జోంగ్యాంగ్ కౌంటీ లో ఉన్న అండర్గ్రౌండ్ కోల్ బంకర్ సోమవారం రాత్రి కూలింది. ఈ ఘటనలో అయిదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జాంగ్జి ప్రావిన్సులో ఉన్న మైనింగ్ కంపెనీకి ఇటీవల సర్కారు వార్నింగ్ ఇచ్చింది. ప్రమాదాలు తగ్గాలంటే బొగ్గు అధిక ఉత్పత్తిని ఆపేయాలని అధికారులు తెలిపారు. గత ఏడాది చైనా బొగ్గు గనుల్లో అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించాయి. హుయే ఎనర్జీ బొగ్గు గనిలో జరిగిన గ్యాస్ పేలుడు వల్ల ఏడుగురు మృతిచెందారు. ఆ ఘటనలో ఇద్దరు మిస్సింగ్లో ఉన్నారు.