చెన్నై: తమిళనాడులోని శక్తిపీఠ క్షేత్రం కాంచీపురంలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్(Encounter) జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీషీటర్లను ఇద్దరు పోలీసులు కాల్చివేశారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారిలో రఘువరన్, కరుప్పు హసన్ ఉన్నారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద ఆ ఇద్దరి రౌడీలను కాల్చివేశారు. తెల్లవారుజామున 3.30 నిమిషాలకు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఓ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న ఆ ఇద్దర్నీ పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఓ బిల్డింగ్లో దాచుకున్న ఆ నలుగురూ.. పోలీసులపై అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రభాకరన్ అనే ఏ-ప్లస్ రౌడీషీటర్ హత్య కేసులో ఆ ఇద్దరూ నిందితులు. ప్రభాకరన్పై సుమారు 20 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతన్ని మంగళవారం మర్డర్ చేశారు.