న్యూఢిల్లీ: దాదాపు 36 ఏండ్ల క్రితం నాటి కేసులో, లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇద్దరు రిటైర్డ్ కల్నల్స్, ఓ మేజర్తో సహా ఎనిమిది మందికి మూడేండ్ల జైలు శిక్ష విధించిందని అధికారులు ఆదివారం పేర్కొన్నారు.
మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్(ఎంఈఎస్) కోసం జరిగిన స్థానిక కొనుగోళ్లలో రూ.3.82 కోట్ల కుంభకోణం జరిగిందని సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్నది. 1983-1985 మధ్య నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వెచ్చించి కొనుగోళ్లు చేశారనే ఆరోపణలతో సీబీఐ 1986, సెప్టెంబర్ 25న కేసు నమోదు చేసింది.