కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరిలోని తీస్తా బ్యారేజ్ యార్డ్ కార్యాలయంలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి. తీస్తా బ్యారేజ్ కోసం తీసుకొచ్చిన పైపులు కొన్ని మిగలడంతో వాటిని కార్యాలయంలో ఆవరణలో భద్రపర్చారు. ఎప్పటి నుంచి ఉన్నాయో ఏమోగానీ, ఇవాళ సిబ్బంది పైపులను పరిశీలించేసరికి వాటిలో రెండు భారీ కొండచిలువలు దాగి ఉన్నాయి.
ఆ పాములను చూడగానే సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ అధికారులు ఆ పాములు రెండింటిని బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలో వాటిని వదిలేశారు. అటవీ అధికారి అరిత్ డే ఈ విషయాన్ని వెల్లడించారు.
West Bengal| We received information that at Teesta Barrage’s mechanical yard office in Fulbari, Siliguri,2 Burmese pythons were spotted, we reached the site and found that 2 pythons were inside a pipe. The rescued Pythons will be released in the forest: Arith Dey,Forest Official pic.twitter.com/1lx3PTRyz9
— ANI (@ANI) January 13, 2023