శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లా గుల్షన్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీస్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పోలీసులు మహ్మద్ సుల్తాన్, ఫయాజ్ అహ్మద్ను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయారు. మరోవైపు ఉగ్రవాదుల దాడి ఘటన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. టెర్రలిస్టుల కోసం అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.