న్యూఢిల్లీ: తీహార్ జైలులో మంగళవారం గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా(Gangster Tillu) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే జైలులో జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు బయకు వచ్చాయి. 2021లో ఢిల్లీ కోర్టులో ఓ గ్యాంగ్స్టర్ను చంపిన టిల్లును మంగళవారం తీహార్ జైలులో ప్రత్యర్థులు హత్య చేశారు. టిల్లు శరీరంపై దాదాపు వందకు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. జైలులో టిల్లును హత్య చేసిన విజువల్స్ సీసీటీవీకి చిక్కాయి. ఆ వీడియోలను రిలీజ్ చేశారు.
కత్తి పోట్లతో రక్తంలో ఉన్న టిల్లు శరీరాన్ని బయటకు తీసుకువస్తున్న సమయంలోనూ.. కొందరు టిల్లుపై అటాక్ చేశారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని వదలలేదు. పోలీసుల సమక్షంలోనే వాళ్లు ఆ దాడి చేశారు. కత్తులతో కసిగా పొడిచేశారు. అయితే పోలీసులు ఆ చోద్యాన్ని చూస్తూ ఉండిపోయారు. కనీసం అడ్డుకోలేకపోయారు.
#WATCH | Delhi | A second CCTV video emerges from Tihar Jail's Central Gallery wherein a few people can be seen bringing gangster Tillu Tajpuriya's body out. The visuals later show two other people stabbing the body and hitting it in the presence of Police personnel. pic.twitter.com/FyE09M95C7
— ANI (@ANI) May 5, 2023
టిల్లును మంగళవారం ప్రత్యర్థి యోగేశ్ జైలులో దాడి చేసి చంపాడు. గ్యాంగ్స్టర్ యోగేశ్తో పాటు అతని అనుచరులు తాజ్పురియాపై ఇనుపరాడ్తో అటాక్ చేశారు. అప్రమత్తమైన జైలు అధికారులు, పోలీసులు.. టిల్లు తాజ్పురియాను చికిత్స నిమిత్తం దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే తాజ్పురియా చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.