న్యూఢిల్లీ, జనవరి 31: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం మరో ఇద్దరి పేర్లు సిఫారసు చేసింది. అలహాబాద్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్ను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని తీర్మానం చేసింది. గత ఏడాది డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం ఐదుగురి పేర్లను సిఫారసు చేసింది. అయితే వీరి నియామకాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా నోటిఫై చేయలేదు.