బెంగళూరు : కర్నాటకలో శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో ఇద్దరు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్ వివాదం, హత్య నేపథ్యంలో శివమొగ్గలోని పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో హింస చెలరేగడంతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఇంకా ఉద్రిక్త పరిస్థితులుండడంతో పోలీసులు కర్ఫ్యూను శుక్రవారం వరకు పొడగించారు. హర్ష హత్య కేసులు ఇప్పటి వరకు ఎనిమిది అరెస్టు చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర తెలిపారు. అయితే, హత్య, హింసకు సంబంధించి శివమొగ్గలోని రెండు పోలీస్స్టేషన్ల పరిధిలోని పోలీస్ సిబ్బందిని సైతం విచారించాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
కోట, దొడ్డపేట స్టేషన్ల పనితీరుపై ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదేళ్లుగా పోలీస్స్టేషన్లలో ఎంత మంది పోలీసులను నియమించారో, అరెస్టయిన ఎనిమిది మంది నిందితులకు నేరచరిత్ర ఉన్నప్పటికీ ఎలా నిఘా ఉంచారో చూడాలన్నారు. ఈస్ట్జోన్ డీఐజీ త్యాగరాజన్ మాట్లాడుతూ నగరంలో పరిస్థితి అదుపులోనే ఉందని, వేగంగా మెరుగుడుపడుతుందన్నారు. శాంతిభద్రతల పరిస్థితిపై సాధారణ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు భద్రతా బలగాలు మంగళవారం ఆ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.