భోపాల్: మధ్యప్రదేశ్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఇవాళ మధ్యాహ్నం మాండ్లా, బాలాఘాట్ జిల్లాల సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మాండ్లా, బాలాఘాట్ జిల్లాలకు చెందిన సంయుక్త పోలీసు బలగాలు మావోయిస్టులకు కోసం ఈ ఉదయం కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ సందర్భంగా బాలాఘాట్ జిల్లాలోని గర్హి ఏరియా, మాండ్లా జిల్లాలోని మోటినాలాకు చెందిన సుప్ఖార్ ఏరియాల మధ్య ఒకరికొకరు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.