శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు లష్కరే తాయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్టు చేశారు. కశ్మీర్లోని షోపియాన్ (Shopian) జిల్లాలోని రాంబీ ప్రాంతంలో టెర్రరిస్టులు (terrorists) ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా సైనికులు వారిని అరెస్టు చేశారు.
వారిని షాహిద్ అహ్మద్, అతని అనుచరుడు కిఫాయత్ అయూబ్ అలీగా గుర్తించారు. వారినుంచి చైనీస్ పిస్తోల్ సహా ఆయుధ సామాగ్రి, పిస్తోల్ మ్యాగజైన్, రెండు చైనీస్ హాండ్ గ్రనైడ్లు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రూ.2.9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.