అమృత్సర్: లష్కరే తోయిబా ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. జమ్ముకశ్మీర్కు చెందిన ఇద్దరిని శనివారం అరెస్టు చేశారు. రెండు ఐఈడీలు, గ్రనేడ్లు, ఒక పిస్తోల్తో పాటు పలు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు.
ఈ ఆపరేషన్ను పంజాబ్ రాష్ట్ర పోలీసు శాఖలోని ప్రత్యేక ఆపరేషన్ సెల్, కేంద్ర సంస్థ సంయుక్తంగా చేపట్టాయి. పంజాబ్లోని శాంతికి విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని, దాన్ని అడ్డుకొన్నామని డీజీపీ గౌరవ్ యాదవ్ పేర్కొన్నారు.