జబల్పూర్: ఓ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అంతా వాహనాలను నిలిపి తమ వంతుకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు వచ్చింది. ముందున్న వాహనాలను ఢీకొడుతూ కూడలి మధ్యలోకి వెళ్లి ఆగిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అంతా నిశ్చేష్టులైన ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగింది. ఇదంతా ట్రాఫిక్ సిగ్నళ్లకు ఉన్న కెమెరాల్లో రికార్డయింది.
హర్దేవ్ పటేల్ అనే వ్యక్తి జబల్పూర్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నారు. రోజూలానే శుక్రవారం తన విధులకు హాజరయ్యారు. బస్సు నడుపుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్టీరింగ్పైనే తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో పట్టణంలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిఉన్న వాహనాలపైకి బస్సు దూసుకెళ్లింది. ఆటో, కొన్ని బైకులను కొద్ది దూరం లాక్కెళ్లి ఆగింది. దీంతో ఓ వృద్ధుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. అయితే లోఫ్లోర్ బస్సు కావడంతో దాని కింద ఎవరూ పడలేదని పోలీసులు తెలిపారు.
CAUGHT ON CAMERA – A city bus in Madhya Pradesh's Jabalpur ran into several vehicles, killing 2, after its driver died of sudden heart attack. #Jabalpur #MadhyaPradesh #Accident pic.twitter.com/MvOEq3lbHV
— TIMES NOW (@TimesNow) December 2, 2022