జైపూర్: రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్నదర్గా వద్ద రెండు గ్రూపుల మద్య ఘర్షణ జరిగింది. బరేల్వీ, ఖాదిమ్ వర్గాల మధ్య ఆ పోరు జరిగినట్లు తెలుస్తోంది. దర్గా వద్ద రెండు వర్గాలు కొట్టుకున్న వీడియో కూడా లీకైంది. సూఫీ సంత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఉర్సు వేడుకలకు హాజరైన బరేల్వీ వర్గ ప్రజలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. బరేల్వీ వర్గానికి అనుకూలంగా వాళ్లు స్లోగన్స్ ఇచ్చారు.
అయితే దర్గాను చూసుకుంటున్న ఖాదిమ్ వర్గ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. నినాదాలు చేయవద్దు అంటూ బరేల్వీ వర్గాన్ని కోరారు. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దళాలకు చెందిన అనేక మంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. దర్గా నిర్వాహకులు జోక్యం చేసుకున్నా.. ఆ రెండు గ్రూపులు వినిపించుకోలేదు.
స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. నినాదాలు చేసిన బరేల్వీ వర్గీయులు ఆ తర్వాత పారిపోయారు. పోలీసులు ఎటువంటి కేసు రిజిస్టర్ చేయలేదు.