జైపూర్: రాజస్థాన్లోని జోద్పూర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈద్, అక్షయ్ తృతీయ వేడుకలకు ముందే ఈ అల్లర్లు చోటుచేసుకోవడం శోచనీయం. జోద్పూర్లోని జలోరి గేట్ కూడలి వద్ద రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. బాల్ముకంద్ బిస్సా సర్కిల్లో కాషాయ జెండాను తొలగించి ఇస్లామిక్ జెండాను పాతారు. ఈద్ ప్రార్థనల కోసం ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను కొందరు తొలగించారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. గుంపుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అల్లర్లలో అనేక మంది గాయపడ్డారు. శాంతి, సామరస్యంతో ఉండాలని సీఎం అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా జిల్లా మొత్తం ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 2G/3G/4G/ మొబైల్ డేటాతో పాటు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సేవల్ని ఆపేశారు.