తమిళనాడులో ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలో వదిలిన ఎద్దుల దాడిలో ఒకరు చనిపోయారు. మరో 34 మంది గాయపడ్డారు.
వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుడిని అరవింద్ రాజ్ (34)గా గుర్తించారు. మరోవైపు, తిరుచిరాపల్లి జిల్లా సురియూర్ గ్రామంలో జల్లికట్టు వీక్షించేందుకు వచ్చిన అరవింద్(25)ను.. ఎద్దు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.