భోపాల్: మధ్యప్రదేశ్లోన్ జబల్పూర్లో (Jabalpur Express) పెను ప్రమాదం తప్పింది. ఇండోర్-జబల్పూర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం ఉదయం జబల్పూర్ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి జబల్పూర్ వస్తున్నది. ఈ క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. అయితే రైలు చాలా తక్కువగా ఉన్నదని, ప్లాట్ఫామ్పై ఆగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు.
అయితే రైలు దిగడానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకు రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్లీ ట్రాక్పైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రైలు జబల్పూర్ స్టేషన్కు చేరుకోబోతుండగా దాని రెండు కోచ్లు పట్టాలు తప్పాయని రైల్వే పీఆర్వో హర్షిత్ శ్రీవాత్సవ చెప్పారు. ఆ సమయంలో రైలు వేగం గంటకు 5 కిలోమీటర్లుగా ఉందన్నారు. అందువల్ల పెద్ద ప్రమాదం జరుగలేదని తెలిపారు. అయితే ప్రమాదం జరుగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. కాగా, రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన ఇతర రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.