న్యూఢిల్లీ: కొత్తగా గుర్తించిన రీకాంబినెంట్ ఎంపాక్స్ వైరస్ జాతికి సంబంధించిన రెండు కేసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ధారించింది. మొదటి కేసు బ్రిటన్లో గుర్తించగా వైరస్ సోకిన వ్యక్తి ఆగ్నేయాసియా దేశానికి ప్రయాణించినట్లు తెలుస్తున్నది. రెండో కేసు భారత్లో నమోదైంది. వైరస్ సోకిన వ్యక్తి అరేబియా ద్వీపకల్పంలోని ఓ దేశానికి ప్రయాణం చేసినట్లు డబ్ల్యూహెచ్వో నివేదిక తెలియచేసింది. వైరస్ జన్యువులను వివరంగా విశ్లేషించగా ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే రీకాంబినెంట్ జాతి వైరస్తో అనేక వారాలపాటు అనారోగ్యానికి గురయ్యారని నివేదిక తెలిపింది. ఈ ఇద్దరు వ్యక్తుల వ్యాధి లక్షణాలు కూడా ఒకే రకంగా ఉన్నాయని పేర్కొన్నది.