కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. విక్టోరియా హాల్ వద్ద డ్రోన్ ఎగరడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది దానిని కూల్చివేశారు. దానిని ఆపరేట్ చేస్తున్న ఇద్దరు బంగ్లా దేశీయులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు డ్రోన్ కెమెరా సాహాయంతో విక్టోరియా మెమోరియల్, దాని పరిసరాలను ఫొటోలు తీస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వారిని బంగ్లాదేశ్లోని రాజ్షాహికి చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. డ్రోన్ను ఎగురవేయడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు. రహస్యంగా ఫొటోలు తీయడం వెనుక కుట్ర ఏమైనా దాగిఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
విక్టోరియా మెమోరియల్ హాల్ను 1906-1921 మధ్యకాలంలో మ్యాకరీనా మార్బుల్స్తో నిర్మించారు. బ్రిటన్ రాణి విక్టోరియా గుర్తుగా అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ దీనిని నిర్మించారు. స్వాతంత్య్రానంతరం దానిని మ్యూజియంగా మార్చారు. ప్రస్తుతం అది కేంద్ర సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఉన్నది.