న్యూఢిల్లీ : ట్విట్టర్కు పోటీగా వచ్చిన దేశీయ సోషల్మీడియా కంపెనీ ‘కూ’ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. సిబ్బందిలో 30 శాతం మందిని తొలగిస్తున్నామని వెల్లడించింది. కొన్ని నెలలుగా నిధుల సమీకరణలో కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలం కావటం, నష్టాలు లేఆఫ్ ప్రకటించడానికి దారితీసిందని, దాదాపు 260 మంది ఉద్యోగుల్ని తొలగించే అవకాశాలున్నాయని సమాచారం. తొలగిస్తున్నవారికి నష్టపరిహార ప్యాకేజీ, వైద్య సేవల ప్రయోజనాల్ని కొనసాగిస్తామని, కొత్త జాబ్ వెతుక్కోవటంలో సహకరిస్తామని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.