న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఫిర్యాదు పరిష్కారానికి ఓ అధికారిని నియమించింది ట్విటర్. ఆ అధికారికి సంబంధించిన పేరు, చిరునామాలను సైట్లో ఉంచింది. అయితే నిబంధనల ప్రకారం నియమించాల్సిన మరో ఇద్దరు కాంప్లయన్స్, నోడల్ అధికారులను పదవులను భర్తీ చేశారా లేదా అన్నదానిపై ట్విటర్ స్పష్టత ఇవ్వలేదు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారిని నియమిస్తున్నట్లు గత నెల 31న ఢిల్లీ హైకోర్టుకు ట్విటర్ తెలిపింది.
ఈ కేసులో ట్విటర్ తరఫున వాదిస్తున్న న్యాయ సంస్థకు చెందిన ధర్మేంద్ర చతుర్నే ఈ పదవిలో నియమించింది. ఇలాంటి చట్టబద్ధమైన పదవులలో బయటి వ్యక్తులను నియమించడాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఈ తాజా నియామకంపై ఇంకా స్పందించలేదు. గత నెలలో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ట్విటర్ నడుచుకోవడం లేదంటూ మే 31న కోర్టులో కేసు దాఖలైంది.