హైదరాబాద్ : తమిళనాడు(Thamilanadu) గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నివాసం లోక్ భవన్ వద్ద టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం లోక్ భవన్ ఎదుటు నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని టీవీకే అభిమానులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు వామపక్షాలు, కాగ్రెస పార్టీ సైతం గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలక పిలుపునిచ్చారు.
కాగా, టీవీకే ఈ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) దక్కలేదు. సొంతంగా 107 స్థానాలు గెలిచిన టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది.