న్యూఢిల్లీ : ఉత్తరాదిలో విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. మధ్యప్రదేశ్లోని దామోహ్ ప్రాంతానికి చెందిన టీవీ నటి చహత్ పాండే (Chahat Pandey) గురువారం ఆప్లో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ సమక్షంలో గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చహత్ పాండే ఆప్ కండువా కప్పుకున్నారు.
పార్టీ అభివృద్ధి కోసం తనకు అప్పగించే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నటి చహత్ పాండే చేరిక పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతుందని ఆప్ వర్గాలు భావిస్తున్నాయి.
24 ఏండ్ల చహత్ పాండే 17 ఏండ్ల వయసులోనే పవిత్ర బంధం షోతో టీవీ రంగంలో అడుగుపెట్టారు. ఆపై ఆమె హమారి బహు సిల్క్, దుర్గా మాత కీ ఛయ్య, నాథ్-జవర్ య జంజీర్ అనే టీవీ సీరియల్స్లో కీలక పాత్రలు పోషించి విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నారు.
Read More :