తిరువనంతపురం : ప్రముఖ మళయాళ నటివ అపర్ణా పీ నాయర్ (Aparna P Nair) తిరువనంతపురంలోని తన ఇంటిలో గురువారం రాత్రి విగతజీవిగా పడిఉన్నారు. పలు సినిమాలు, టీవీ సీరియల్స్, షోస్లో నటించి పేరుతెచ్చుకున్న అపర్ణ (31) ఆమె నివాసంలోనే అపస్మారక స్ధితిలో కనిపించడంతో కలకలం రేగింది.
కిల్లిపాళంలోని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి నటి మరణవార్త సమాచారం తమకు అందిందని పోలీసులు పేర్కొన్నారు. అపర్ణను ఆస్పత్రికి తరలించేలోగానే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మరణానికి కారణాలేంటనేది వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అపర్ణా నాయర్ చందనమజ, ఆత్మసాక్షి, మైథిలి వీంద వరుం, దేవస్పర్శం వంటి టీవీషోలతో గుర్తింపు పొందారు. మేఘతీర్ధం, ముధుగు, ఆచయనాస్, కోడతి సమక్షం బలన్ వకిల్, కల్కి వంటి సినిమాల్లో నటించిన అపర్ణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read More :
Rishi Sunak | రిషీ సునాక్ కేబినెట్లో మరో భారత సంతతి మహిళ