జమ్మూ కశ్మీర్లోని సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. బీఎస్ఎఫ్ అధికారులు గస్తీ తిరుగుతుండగా ఈ సొరంగం బయటపడింది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకి అత్యంత సమీపంలోనే వుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం జరిగిన పాక్ అక్రమ చొరబాట్లు ఇదే సొరంగం గుండా జరిగిందని ఆర్మీ ఓ నిర్ణయానికి వచ్చింది.
ఈ వ్యవహారంపై బీఎస్ఎఫ్ పీఆర్వో స్పందించారు. సాంబా ప్రాంతంలోని బాడ్ ఏరియాలో ఓ సొరంగం బయటపడింది. దీంతో అలర్ట్ అయ్యాయి. విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేస్తున్నాం. అంతర్రాష్ట్రీయ సరిహద్దులకు అత్యంత సమీపంలోనే ఈ సొరంగం వుంది. తాజాగా జరిగిన అక్రమ చొరబాట్లు ఈ సొరంగం ద్వారా జరిగాయని మాకు అనుమానాలు వున్నాయి అని పేర్కొన్నారు.