సాగర్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 118 ఏళ్ల బామ్మ టీకా తీసుకున్నది. సాగర్కు చెందిన తులసీ భాయ్.. టీకా తీసుకున్న తర్వాత ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఆ జిల్లా కలెక్టర్ దీపక్ సింగ్ తెలిపారు. ఆదివారం రోజున తులసీ భాయ్ తన తొలి డోసు టీకా తీసుకున్నది. దేశంలో టీకా తీసుకున్న అత్యధిక వయసున్న వృద్ధురాలిగా తులసీ రికార్డు సృష్టించారు. సాగర్ జిల్లాలోని సర్దార్పూర్ గ్రామానికి చెందిన బామ్మ.. బుందేల్ భాష మాట్లాడుతుంది. ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీ ప్రకారం.. తులసీ భాయ్ 1903, జనవరి ఒకటో తేదీన జన్మించింది. నేను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాను, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి, టీకా తీసుకోవడంలో ఎటువంటి సమస్య లేదు, టీకా ఇచ్చే వరకు వేచి ఉండాలని ఆ బామ్మ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నది.