Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం బస్ స్టాప్లో వేచి చూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మధ్యప్రదేశ్ రత్లాం జిల్లా కేంద్రంలో ఆదివారం.. కొందరు ప్రయాణికులు బస్సుకోసం రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్లో వేచి చూస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ముందుగా రోడ్డు దాటుతున్న ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టింది. అనంతరం అదే స్పీడ్లో బస్టాండ్లో ఉన్న వారిపైకీ దూసుకెళ్లింది. ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఈ దుర్ఘటనలో లారీ చక్రాల కిందపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు. ప్రమాదంలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయని.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఘటన అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడని పోలీసు అధికారి అభిషేక్ తివారి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
रतलाम के सातरुंडा चौराहे पर तेज रफ्तार ट्रक ने बाइक सवारों को चपेट में लेने के बाद सड़क किनारे बैठे लोगों को कुचला 6 की मौत,12 घायल,सीसीटीवी में तेज स्पीड में दिख रहा ट्रक @RatlamCollector @DIG_RATLAM_MP#cctvfootage#Viral pic.twitter.com/Nkn39PKB8w
— Arun Kumar Trivedi (@ArunTrivedi_) December 4, 2022