లక్నో: దేశ రాజధాని ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. యూపీలోని బాందా జిల్లా మావాయ్ బజ్రంగ్లో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను ట్రక్కు ఢీకొట్టింది.. అనంతరం ఆమెను 3 కిలోమీటర్ల మేర లాక్కెల్లింది.
లక్నోకు చెందిన పుష్ప దేవి.. బజ్రంగ్లోని బీకే గుప్తా యూనివర్సిటీలో క్లర్క్గా పనిచేస్తున్నది. నిత్యావసరాల కోసం బుధవారం రాత్రి ఆమె తన స్కూటర్పై వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో స్కూటర్తోపాటు ఆమె ట్రక్కు చాసిస్లో చిక్కుకుపోయింది. అయినప్పటికీ డ్రైవర్ ఆపకుండా అలానే వెళ్లడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. తోటి వాహనదారులు లారీని వెంబడించినప్పటికీ డ్రైవర్ ఆపకుండానే 3 కిలోమీటర్ల మేర లాక్కెల్లాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ట్రక్కును అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మహిళను లారీ కిందిని తీశామని, అయితే అప్పటికే ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Uttar Pradesh | A lady govt officer died on the spot, in Banda district, after her two-wheeler vehicle was hit by a truck & got stuck into it. The vehicle was dragged after being stuck in the truck due to which a fire broke out in the truck: ASP Banda pic.twitter.com/cLSIMBrH6J
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 4, 2023