బెంగళూరు, జూలై 31: ఇప్పుడు దొంగల కన్ను టమాటాలపై పడింది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల టమాటాల దొంగతనాలు వెలుగుచూడగా.. తాజాగా కర్ణాటకలోనూ జరిగింది. దాదాపు 11 టన్నుల టమాటాలను కోలార్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కు రవాణా చేయడానికి లారీలో ఎక్కించారు. అయితే ఈ లారీ కనిపించకపోవడంతో వ్యాపారి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
వెంటనే డ్రైవర్, క్లీనర్కు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనానికి గురైన టమాటాల విలువ రూ.21 లక్షలు ఉంటుందని వ్యాపారి చెప్పాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.