Chicken | లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా హైవేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ వాహనాల్లో కోళ్ల లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కు కూడా ఉంది. ఇక ఆ ట్రక్కును గమనించిన వాహనదారులు, స్థానికులు.. క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ట్రక్కులో ఉన్న కోళ్లను ఎత్తుకెళ్లారు. కొందరైతే సంచుల్లో కోళ్లను వేసుకుని వెళ్లిపోయారు. అలా నిమిషాల వ్యవధిలో ట్రక్కులో ఉన్న కోళ్లను మాయం చేశారు. సుమారు 200 కోళ్లను ఎత్తుకెళ్లగా, రూ. 50 వేల నష్టం జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ఏర్పడింది. దీంతో విజిబిలిటీ లేదు. ఈ క్రమంలో డజన్ల కొద్ది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి గురైన వాహనాల్లో కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉందని, దాని డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపారు. జర్నా నాలా వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. ట్రక్కులో కోళ్లను గమనించిన వాహనదారులు, స్థానికులు ఎగబడి ఎత్తుకెళ్లారని సునీల్ వాపోయారు. తాను ఆగ్రా నుంచి కాస్గంజ్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కోళ్లను ఎత్తుకెళ్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితాం లేకుండా పోయిందన్నారు. రూ. 50 వేల విలువ చేసే కోళ్లను ఎత్తుకెళ్లారని సునీల్ తెలిపారు.
In UP’s Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g
— Piyush Rai (@Benarasiyaa) December 27, 2023