న్యూఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఇతర విపక్ష పార్టీల ఎంపీలు కూడా పాల్గొన్నారు.
పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన.. pic.twitter.com/SP03GBTHKG
— Namasthe Telangana (@ntdailyonline) July 20, 2022