అగర్తల: బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలు, వ్యక్తులపై దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మంగళవారం సాయంత్రం త్రిపురలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ధర్మానగర్ జిల్లా చంతిల్లా ప్రాంతంలో ఒక మసీదును ధ్వంసం చేశారు. రెండు షాపులకు నిప్పుపెట్టారు. రోవా బజార్ సమీపంలో మైనారిటీ వర్గాలకు చెందిన మూడు ఇళ్లు, కొన్ని దుకాణాలను కూడా దోచుకున్నారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భానుపాద చక్రవర్తి తెలిపారు. ఈ ఘటనలపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ధర్మానగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు.