అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహాకు కరోనా సోకింది. కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన బుధవారం వెల్లడించారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. తనను కలిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం ఒక ట్వీట్ చేశారు. కరోనా టెస్ట్ రిపోర్ట్ను కూడా అందులో పోస్ట్ చేశారు. ‘ఈ రోజు నాకు జరిపిన కరోనా పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. నేను పూర్తిగా ఫిట్గా ఉన్నాను. ఎటువంటి లక్షణాలు లేవు. నన్ను సంప్రదించిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, త్రిపుర తొలి బీజేపీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ స్థానాన్ని మాణిక్ సాహా భర్తీ చేశారు. ఈ ఏడాది మే 14న అనూహ్యంగా ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. డెంటల్ సర్జన్ నుంచి రాజకీయ నేతగా మారిన ఆయన జూన్ 26న జరిగిన ఉప ఎన్నికల్లో తగిన మెజార్టీతో గెలిచారు.
I've been tested Covid-19 positive today. I am absolutely fit & fine with no symptoms.
I humbly request all those who've come in contact with me to take necessary precautions. pic.twitter.com/RcKDcLSiNx— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) July 20, 2022