అగర్తలా: ఫిబ్రవరి 16వ తేదన త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో 259 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో 45 మంది కోటీశ్వరులు ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. దాంట్లో బీజేపీ అభ్యర్థులు 17 మంది, తిప్రా మోతా పార్టీలో 9 మంది, సీపీఐలో ఏడు మంది ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అన్న సంస్థ ఈ రిపోర్టును ఇచ్చింది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు కోటీశ్వరులు కూడా ఉన్నారు. టీఎంసీకి చెందిన నలుగురు, ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మకు అత్యధికంగా 15.58 కోట్లు ఉన్నాయి. సీఎం మానిక్ సాహా 13.90 కోట్లతో లిస్టులో రెండవ స్థానంలో ఉన్నారు.
పోటీలో ఉన్న 41 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్కు చెందిన 13, బీజేపీకి చెందిన 9 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 8 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.