కోల్కతా: ప్రతిపక్షాల ఐక్యత పుంజుకుంటున్నదని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి గుణపాఠం కానున్నాయని తృణమూల్ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ హెచ్చరించింది. టీఎంసీ తన జాగో పత్రిక ద్వారా శుక్రవారం కేంద్రం చర్యలను ఎండగట్టింది. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 20 విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించింది.
‘రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం యావత్ ప్రజలను అవమానించడమే. ఆదివాసీకి రాష్ట్రపతి పదవి ఇచ్చామని గొప్పలు చెపుకొన్నారు. రాష్ట్రపతిని మోదీ-అమిత్ షా తీవ్రంగా అవమానిస్తున్నారు. వారు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఆ పదవి ఇచ్చారన్న విషయం అర్థమవుతున్నది’ అని పేర్కొంది. విపక్షాలన్నీ ఏకమవ్వడం శుభపరిణామమని పేర్కొంది.