న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్(MP Sushmita Dev) ఆ పార్టీని వీడారు. పార్టీకి చెందిన అన్ని పోస్టులకు ఆమె రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్కు లేఖ రాశారు. గత వారం రోజుల్లోనే ఆ పార్టీకి చెందిన రెండో ఎంపీ రాజీనామా చేశారు. 53 ఏళ్ల సుష్మితా దేవ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆమె 2021లో తృణమూల్ పార్టీలో చేరారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నట్లు ఆమె చెప్పారు. సుష్మితా దేవ్ తండ్రి ఫేమస్ బెంగాలీ నేత సంతోష్ మోహన్ దేవ్. గతంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ వుమెన్ వింగ్ చీఫ్గా చేశారామె. అస్సాంలోని సిల్చార్ నుంచి ఆమె గతంలో ఎంపీగా చేశారు.
సోమవారం రోజున రాజ్యసభ ఎంపీ సుఖేందు శేకర్ రాయ్ .. పార్లమెంట్తో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాయ్ తన పత్రికా ప్రకటనలో తృణమూల్ పై అటాక్ చేశారు. బెంగాల్లో 15 పాలన పేలవంగా సాగిందన్నారు. బెంగాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ లక్ష్యాలను అమలు చేసేందుకు సంపూర్ణంగా పనిచేస్తున్నదని, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని, తృణమూల్ పార్టీ ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాయ్ తన ప్రకటనలో చెప్పారు.