కోల్కతా: మోసం కేసులో బెంగాల్ నటి, తృణమూల్ ఎంపీ నుష్రత్ జహాన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. నగరంలోని న్యూటౌన్లో తమకు ఫ్లాట్లు ఇస్తామంటూ రియల్ ఎస్టేట్ తరఫున వాగ్దానం చేసి మోసగించారన్న ఆరోపణల కేసులో ఆమె ఈ నెల 12న కోల్కతాలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ చర్యను అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం ప్రతీకార చర్యేనని మండిపడింది.