కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ రఫాడించింది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ విజయ దుందుబీ మోగించిన దీదీ పార్టీ.. అదే ఊపులో కొత్త రికార్డులను నమోదు చేసింది. దిన్హటా నియోజకవర్గం నుంచి తృణమూల్ అభ్యర్థి ఉదయన్ గుహ 1,64,089 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అశోక్పై నెగ్గారు. ఇక గోసాబా స్థానం నుంచి సుబ్రతో మోండల్ గెలిచారు. 1,43,051 ఓట్ల తేడాతో సుబ్రతో విజయం సాధించడం విశేషం. బీజేపీకి చెందిన పలాషా రాణాపై టీఎంసీ నేత విక్టరీ కొట్టారు. ఇక శాంతిపూర్ నుంచి బ్రజ కిశోర్ గోస్వామి 64,675 ఓట్ల తేడాతో బీజేపీ నేత నిరంజన్పై విజయం సాధించింది. ఖర్దా సీటు నుంచి తృణమూల్ నేత 93832 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి జోయ్ షాపై గెలుపొందారు.