Mahua Moitra | కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని చెప్తున్న బీజేపీ ఎందుకు భయపడుతున్నదని, హేమంత్ సొరేన్, కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేసిందని తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్ర ప్రశ్నించారు. తన కోసం ఈడీ, సీబీఐ వచ్చినా తాను భయపడబోనన్నారు. బీజేపీ హయాంలో తాను ఎంపీగా బహిష్కరణకు గురికావడం అంటే తనకు గౌరవ బ్యాడ్జి ఇచ్చినట్టేనని పేర్కొన్నారు.
బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జి ఇప్పుడు బీజేపీతో ఉన్నారని, తర్వాత సీబీఐ డైరెక్టర్ వీఆర్ఎస్ తీసుకొని బీజేపీ టికెట్పై పోటీ చేయవచ్చేమోనన్నారు.