న్యూఢిల్లీ: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఫాసిజానికి మద్దతు ఇస్తున్నారని, ఆయన నేతృత్వంలోని బీజేడీ బీజేపీకి అనధికార భాగస్వామి అని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ ఆరోపించారు.
‘మణిపూర్లోని ఉద్రిక్త పరిస్థితుల గురించి పట్నాయక్ మాట్లాడరు’ అని ఓబ్రియన్ విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీని నిలువరించేందుకు కలిసి పని చేద్దామని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నవీన్ను గతంలో అడిగినపుడు ఆయన స్పందించలేదు.